భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు

ABN , First Publish Date - 2020-12-07T04:45:08+05:30 IST

ఈనెల 8న భారత రైతాంగం తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు పలుకుతుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు

  • మంత్రి సబితారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఈనెల 8న భారత రైతాంగం తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు పలుకుతుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతుకు పెద్దపీట వేస్తూ తెలంగాణలో రైతు బాంధవునిగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తూ నేడు రైతులకు అండగా నిలబడాలని ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులందరూ కలిసి రావాలని కోరారు. ఈ బంద్‌లో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, రైతుబంధు ప్రతినిధులు పార్టీ నాయకులు, రైతులు రహదారులపై ధర్నా, రాస్తారోకోలు నిర్వహించి మద్దతు తెలపాలని కోరారు. ఎముకలు కొరికే చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కేంద్రంతో పోరాడుతున్నారని, వారికి సంఘీభావంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈనెల 8న బంద్‌లో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆమె కోరారు. 

Updated Date - 2020-12-07T04:45:08+05:30 IST