మంత్రి కిషన్రెడ్డిని కలిసిన పారామిలటరీ ఉద్యోగులు
ABN , First Publish Date - 2020-12-16T05:09:43+05:30 IST
మంత్రి కిషన్రెడ్డిని కలిసిన పారామిలటరీ ఉద్యోగులు
యాచారం : పెం డింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారామిలటరీ ఉద్యోగుల సంఘ నాయకు లు మంగళవారం కేంద్ర హోంశాఖ స హాయమంత్రి జి.కిషన్రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. చాలాకాలంగా తమ ఇబ్బందులు తీర్చడంలో అధికారులు చొరవ చూపడం లేదని వారు మంత్రికి వివరించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఆసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీబీ రామకృష్ణ, అధ్యక్షుడు బూర సైదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.దేవేందర్, రాష్ట్ర మహిళా అధ్యక్షరాలు అరుణారెడ్డి, రోహిణ్రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పీఎన్రావు పాల్గొన్నారు.