వైభవంగా వేంకటేశ్వరస్వామి ధ్వజారోహణం

ABN , First Publish Date - 2020-03-23T06:00:54+05:30 IST

పేదల తిరుపతిగా పేర్గాంచిన శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ప్ర ధాన ఘట్టం ధ్వజారోహణం ఆదివారం...

వైభవంగా వేంకటేశ్వరస్వామి ధ్వజారోహణం

  • కరోనా ప్రభావంతో పురోహితులతోనే బ్రహ్మోత్సవాల నిర్వహణ 

కొడంగల్‌: పేదల తిరుపతిగా పేర్గాంచిన శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ప్ర ధాన ఘట్టం ధ్వజారోహణం ఆదివారం వైభవంగా కొనసాగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా కొనసాగే బ్రహ్మోత్సవాలు టీటీడీ ప్రధాన అర్చకులు సుందరవరదభట్టాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించా రు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా పురోహితులు, ఆలయ ధర్మయ ధర్మకర్తల ఆధ్వర్యం లో పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు కొనసాగాయి.


బ్రహ్మోత్సవాలకు కొడంగల్‌ పరిస ర ప్రాంతాలు, కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చే ప్రజలు కరోనా వైరస్‌ ప్రభావంతో ఉత్సవాలకు దూరంగా ఉ న్నారు. ప్రతీ సంవత్సరం గోవింద నామ నా మస్మరణలతో వైభవంగా కొనసాగే బ్రహ్మోత్సవాలు జనతా కర్ప్యూ కారణంగా భక్తులు హాజరు కాలేదు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉ దయం 8గంటల నుంచి 9గంటల వరకు స్వా మివారి తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆరాధాన, వాస్తుహోమం, గరుడలింగహో మం, గరుడ ప్రతిష్ట, రక్షాబంధన్‌ కార్యక్రమా లు చేపట్టారు. మేషలగ్నంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ధ్వజారోహణం నిర్వహించారు. వైకానాస శాస్త్రోక్తంగా గరుత్మతునినూతన వస్త్రంపై లిఖించి పూజలతో ద్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఉత్సావాల్లో ఆలయ పురోహితులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-23T06:00:54+05:30 IST