ప్రశ్నించే గొంతుకను గెలిపించుకుందాం
ABN , First Publish Date - 2020-11-01T06:47:51+05:30 IST
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ నాగేశ్వర్ను గెలిపించుకుందామని జిల్లా కార్యదర్శి మల్లేష్ కోరారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్
వికారాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ నాగేశ్వర్ను గెలిపించుకుందామని జిల్లా కార్యదర్శి మల్లేష్ కోరారు. శనివారం వికారాబాద్లో సీపీ ఎం జిల్లా కార్యవర్గసభ్యుడు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన స మావేశంలో మల్లేష్ మాట్లాడారు. నాగేశ్వర్ గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలుపొంది ప్రజలకు ఎన్నోసేవలు అందించారని చెప్పారు. గతంలో నాగేశ్వర్ ప్రశ్నించడం వల్లనే కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యాయని, జి ల్లాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. మరోసారి శాసనమండలికి పంపిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో మహిపాల్, చంద్రయ్య, శ్రీనివాస్, బుగ్గప్ప, రామకృష్ణ, శ్రీను, వెంకట్రాములు, సు భాష్, రవి, సుదర్శన్, యాదగిరి, దీపక్ పాల్గొన్నారు.