సతులకు బదులు పతులు!

ABN , First Publish Date - 2020-12-16T05:23:37+05:30 IST

సతులకు బదులు పతులు!

సతులకు బదులు పతులు!
అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులు

  • ఎమ్మెల్యేతో సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు

శంకర్‌పల్లి: అధికారిక సమావేశంలో ప్రజాప్రతినిధుల భర్తలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొనటాన్ని పలువురు విమర్శించారు. శంకర్‌పల్లి మండల పరిషత్‌లో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో రూర్బన్‌ నిధుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, డీఆర్డీవో పీడీ ప్రభాకర్‌, పీఆర్‌ డీఈ జగన్‌రెడ్డి, ఎంపీడీఓ సత్యయ్య పాల్గొన్నారు. జడ్పీటీసీకి బదులు ఆమె భర్త గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గోపాల్‌ పాల్గొనటం విమర్శలకు తావిచ్చింది. 

Updated Date - 2020-12-16T05:23:37+05:30 IST