పరిశుభ్రత పాటించాలి
ABN , First Publish Date - 2020-03-02T10:57:18+05:30 IST
గ్రామంలో అందరూ పరిశుభ్రత పాటించాలని బొం పల్లి సర్పంచ్ సురేష్ అన్నారు. మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో ఆదివారం ట్రాక్టర్తో రోడ్లపై చెత్త సేకరించి

దోమ: గ్రామంలో అందరూ పరిశుభ్రత పాటించాలని బొం పల్లి సర్పంచ్ సురేష్ అన్నారు. మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో ఆదివారం ట్రాక్టర్తో రోడ్లపై చెత్త సేకరించి డంపింగ్యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు ఇళ్లలోని చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ ఉంచి ఇళ్ల ముందుకొచ్చే ట్రాక్టర్లో వేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.