సీఎం రిలీఫ్‌ఫండ్‌కు విరాళాల అందజేత

ABN , First Publish Date - 2020-03-27T12:06:43+05:30 IST

కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా పేద ప్రజలను ఆదుకునేందుకు తన వంతు సాయంగా

సీఎం రిలీఫ్‌ఫండ్‌కు విరాళాల అందజేత

వికారాబాద్‌: కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా పేద ప్రజలను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.లక్ష  చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్టు చార్టెడ్‌ అకౌంటెంట్‌ హుమ్నాబాద్‌ మధు చెప్పారు.  గురువారం ఆయన వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు రూ.లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోందని, ఈ సమయంలో పేద ప్రజలకు అండగా నిలవటం ఎంతో అవసరమని అన్నారు. అనంతరం మధును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివా్‌సరావు, మాజీ వైస్‌చైర్మన్‌ సి.రమే్‌షకుమార్‌ పాల్గొన్నారు. 


రూ.50వేలు అందజేసిన ఎంపీటీసీ 

మర్పల్లి: కరోనా బాధితులతో పాటు రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా రూ.50వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్టు పట్లూరు ఎంపీటీసీ స్వప్నసురేష్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు చెక్కును అందజేశారు.

Updated Date - 2020-03-27T12:06:43+05:30 IST