పరిగిలో పీఎం దిష్టిబొమ్మ దగ్ధం

ABN , First Publish Date - 2020-12-06T04:56:38+05:30 IST

పరిగిలో పీఎం దిష్టిబొమ్మ దగ్ధం

పరిగిలో పీఎం దిష్టిబొమ్మ దగ్ధం
దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు

పరిగి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం పరిగి పట్టణంలో పీఎం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు, నిత్యావసర సరుకుల చట్టం, ఒప్పందసాగుచట్టం, వ్యవసాయ స్వేచ్ఛ మార్కెట్‌ చట్టాలతో రైతులు వీధినపడే అవకాశం ఉందన్నారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్‌రాంలు, హబీబ్‌, ఈశ్వరయ్య, యాదయ్య, కుమార్‌,చెన్నయ్య, మాణిక్యం, శ్రీను, రాంచంద్రయ్య, శ్రీనివాస్‌,రవి, హరీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:56:38+05:30 IST