సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2020-10-21T07:01:28+05:30 IST
ప్రయివేటు టీచర్లను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం

మేడ్చల్: ప్రయివేటు టీచర్లను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం మేడ్చల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణంలోని వివేకానంద చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, అర్జున్, నాగసాయి, సాయియాదవ్, రాఘవరెడ్డి, అవినా్షచారి, రాజానంద్, రాజేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, మహేష్, సతీష్ పాల్గొన్నారు.