-
-
Home » Telangana » Rangareddy » Congress Leaders meet to MP Revanthreddy
-
ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలని వినతి
ABN , First Publish Date - 2020-12-31T05:08:07+05:30 IST
ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలని వినతి

కీసరరూరల్ : దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు మల్కా జిగిరి ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డిని నగరంలోని అయన నివాసంలో బుధవారం కలిశారు. ము న్సిపల్ పరిధిలోని రెవె న్యూ సర్వే నంబర్ 530/5లోని ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, దానిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎంపీ తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ వరగంటి వెంకటేష్, కౌన్సిలర్లు గోగుల సరిత, పార్టీ అధ్యక్షుడు సురకంటి శ్రీకాంత్రెడ్డి, నాయకులు ముప్ప రామారావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.