అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు
ABN , First Publish Date - 2020-12-04T04:46:21+05:30 IST
అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి
యాలాల : ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసినప్పుడే మంచి గుర్తింపు వస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడి అన్నారు. యాలాల మండలం పగిడ్యాల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జగన్నాథ్రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక ఎస్వీఆర్ ఫంక్షన్ హాలులో గురువారం నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. అనంతరం జగన్నాథ్రెడ్డిని పూమాలలు, శాలువాలు, మెమొంటోలతో సన్మానించారు. కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, జడ్పీటీసీ సంధ్యారాణి, తాండూరు మార్కెట్ చైర్మన్ విఠల్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సుధాకర్రెడ్డి, ప్యాట బాల్రెడ్డి, రమేష్, బాల్రెడ్డి, యాదప్ప తదితరులు పాల్గొన్నారు.