తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి
ABN , First Publish Date - 2020-10-27T11:12:32+05:30 IST
తెలంగాణలో ని కల్వకుర్తి నుంచి నాగర్కర్నూ ల్-కొల్లాపూర్ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్మకూర్, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ 122కిలో మీటర్ల జా తీయ రహదారి నిర్మాణానికి కేం ద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జాతీయ
అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి వెల్లడి
ఆమనగల్లు: తెలంగాణలో ని కల్వకుర్తి నుంచి నాగర్కర్నూ ల్-కొల్లాపూర్ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్మకూర్, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ 122కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జాతీయ బీసీ కమిషన్ స భ్యులు తల్లోజు ఆచారి తెలిపా రు. ఈ మేరకు జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. సోమవారం ఆచారి ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారికి అ నుమతినిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన జాతీయ రహదారితో హైదరాబాద్-తిరుపతి మధ్య 80కిలోమీటర్లు దూరం తగ్గుతుందని తెలిపారు. భారత్ మాల పథకం కింద చేపట్టనున్న ఈ హైవేపై సోమశిల వద్ద బ్రిడ్జి నిర్మిస్తారని ఆచారి వివరించారు.