బైక్ను ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2020-12-01T04:58:18+05:30 IST
బైక్ను ఢీకొన్న కారు
- తల్లీకొడుకులకు తీవ్ర గాయాలు
శంకర్పల్లి: కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా నడిపి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్న సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్గౌడ్, ప్రభావతి బైక్(టీఎస్ 15 ఈఎస్0030)పై శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలోని వారి బంధువుల వద్దకు వెళ్తున్నారు. వారు పత్తేపూర్ పైవంతెన మీదికి చేరుకోగానే చేవెళ్ల నుంచి శంకర్పల్లి వైపు కారు(టీఎస్34 సీ3420)లో వస్తున్న ముబారక్పూర్ యువకుడు అతి వేగంగా రాంగ్రూట్లో వచ్చి బైక్ను ఢీకొట్టాడు. దీంతో బైక్పై ఉన్న తల్లీ కొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని సంగారెడ్డిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిసితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.