విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలి

ABN , First Publish Date - 2020-03-16T06:05:58+05:30 IST

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత విద్యాభ్యాసానికి కృషి చేయాలని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణిరాజేందర్‌, కౌన్సిలర్‌ శ్రీలతయాదవ్‌, పాఠశాల వ్యవస్థాపకులు వెంకటయ్య అన్నారు.

విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలి

కొడంగల్‌: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత విద్యాభ్యాసానికి కృషి చేయాలని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణిరాజేందర్‌, కౌన్సిలర్‌ శ్రీలతయాదవ్‌, పాఠశాల వ్యవస్థాపకులు వెంకటయ్య అన్నారు. స్థానిక నవీన ఆదర్శ కాన్వెంట్‌ పాఠశాలలో శనివారం రాత్రి ఫేర్‌వెల్‌ పార్టీని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వైస్‌ చైర్‌పర్సన్‌ తదితరులు మాట్లాడుతూ పదో తరగతిలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పోటీ సమాజంలో లక్ష్య సాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాములు, ప్రిన్సిపాల్‌ నరేశ్‌రాజ్‌, లక్ష్మీ, సంతోష్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-16T06:05:58+05:30 IST