రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2020-12-29T04:25:25+05:30 IST
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మేడ్చల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మేడ్చల్ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన హరీష్(19) సోమవారం ఉదయం నగరంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తాతను చూసేందుకు బైక్పై బయలుదేరగా మార్గమధ్యంలో రాజీవ్రహదారిపై మురారిపల్లి భారత్ బయోటెక్ జంక్షన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో హరీ్షరోడ్డు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.