ఆశలు నెరవేరేనా?

ABN , First Publish Date - 2020-10-07T10:48:01+05:30 IST

ఓ మహిళ గర్భం దాల్చి నప్పటి నుంచి ఆసుపత్రికి చేరే వరకు.. పుట్టిన బిడ్డ నుంచి

ఆశలు నెరవేరేనా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లు

ప్రాణాలకు తెగ్గించి విధులు నిర్వహిస్తున్నా వేతనాలు మాత్రం అంతంతే!

కనీస వేతనం అందించాలని కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు

ఉమ్మడి జిల్లాలో 2,010 మంది ఆశాలు


కామారెడ్డిటౌన్‌, అక్టోబరు 6: ఓ మహిళ గర్భం దాల్చి నప్పటి నుంచి ఆసుపత్రికి చేరే వరకు.. పుట్టిన బిడ్డ నుంచి రేండెళ్లలోపు చిన్నారుల వరకు టీకా లు వేయించడం.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం.. క్షయబాధితులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించే దిశగా కృషిచేయడం.. ప్రాణాంతంకమైన కరోనా వైరస్‌ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం.. వారికి తగిన వైద్యసేవలు అందేలా చూడ డం.. ఇలా ఒక్కటేమిటి వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది.. ఆశ కార్యకర్తలే. ఎన్నికలు, ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు టీకా లు, వ్యాక్సిన్‌లు, ఐసీడీఎస్‌లో వారి సేవలు తప్పని సరి. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకంలో వారి భాగస్వామ్యం ఉంటుంది. ఇన్ని సేవల ందిస్తున్న ఆశ కార్యకర్తలను ప్రభుత్వం మాత్రం విస్మరిస్తోంది. వారికి చెల్లించాల్సిన పారితోషకాలను పెంచకపోవడం.. అంతకముందు నుంచి అమలులో ఉన్న పారితోషకాలను పూ ర్తిస్థాయిలో అందించకపోవడంతో పాటు ఏండ్ల తరబడి పని చేస్తున్నవారికి కనీస వేతనంగా రూ.10 వేలు ఇవ్వాలని డి మాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రజాసం ఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పట్టింపులేని తనాన్ని ప్రశ్నిస్తూ పారితోషకం కిందకు వచ్చే పనులతో పాటు మిగిలిన పనులు కూడా చేస్తున్న వారికి అందాల్సిన పారితోషకం అందకపోవడంతో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేప డుతున్నారు.


ఎటూ సరిపోని పారితోషికం

ఆశలకు పారితోషకాలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటి ంచినా.. ఇంత వరకు అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో పాటు అంతకముందు అందించే పారితోషకాలు సై తం అంతంతమాత్రంగానే అందుతున్నాయని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పైగా పారితోషకాలు లేని అనేక అదనపు ప నులను తమతో చేయిస్తూ కష్టానికి తగ్గ ప్రతిఫలంకూడా అందించడం లేదని, దీంతో కుటుంబ అవసరాలతో పాటు, విధినిర్వహణలో రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. క్షయ బాధితులను గుర్తించేం దుకు ఉదయమే విధులకు హాజరుకావాలని అధికారులు చె బుతుండడంతో ఇంట్లో పనులను సైతం చేసుకోలేని పరిస్థితు లు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల లో నూతనంగా ప్రవేశపెట్టే పథకాలల అమలులో ప్రతీ పని ని నిర్వహిస్తున్నా.. తమ సేవలకు మాత్రం తగిన గుర్తింపు రావడం లేదని వారు పేర్కొంటున్నారు.


 కరోనా విధులు నిర్వహిస్తున్నా.. గుర్తింపు కరువు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశా ఖ అధికారుల సూచనల మేరకు ప్రాణాలకు తెగ్గించి విధులు నిర్వహిస్తున్నా.. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రచారంలో పా ల్గొన్నా చుట్టు పక్కల వారితో పాటు ఇతరులు దూరం పెట్టి నా ఎలాంటి ఇబ్బందులు పడకుండా విధులు నిర్వహించిన తమకు గుర్తింపే లేదని ఆశ కార్యకర్తలు వాపోతున్నారు. కరో నా వైరస్‌ సోకిన వ్యక్తి కుటుంబసభ్యులే పట్టించుకోని సమ యంలో తాము ధైర్యంగా వెళ్లి నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తూ మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తున్న తమను మాత్రం ప్రభుత్వం ప్రతీసారి విస్మరిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచి ఇంట్లో హడావిడిగా పను లు ముగించుకుని విధుల్లో చేరుతూ ఏ రాత్రికో ఇంటికి చేరు తున్న తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని, ఇప్పటి కైనా ప్రభుత్వం తమను గుర్తించాలని, పనిభారం తగ్గించాల ని కోరుతున్నారు.


కనీస వేతనం అందించాలని డిమాండ్‌

సాధారణంగా ప్రతీ ప్రభుత్వ శాఖలో వివిధ రకాలుగా వి ధులు నిర్వహించే సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకున్నా 


జీతం రూపంలో  

ఎంతో కొంత చెల్లిస్తారు. కానీ ఆరోగ్యశాఖ లో విధులు నిర్వహించే ఆశ కార్యకర్తలకు అలాంటి పరిస్థితి లేదు. రోజంతా గ్రామాల్లో సేవలందిస్తున్నా పారితోషకంతో సరిపెడుతూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆశలు గ్రామాల్లో గర్భిణిని గుర్తిస్తే రూ.400, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయిస్తే రూ.500, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయిస్తే రూ.600 ఇలా వారి సేవలను బట్టి పారితోషి కం అందిస్తారు. ఒకవేళ గర్భిణి ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తే ఆ నగదు కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేస్తూ వారు ఇబ్బందులకు గురవుతున్నారు. అలా పారితోషికంతో ముడిపెట్టకుండా వారి సేవలకుతగ్గ గుర్తింపునిస్తూ.. కనీస వేతనంగా రూ.10వేలు అందించాలని, ఈఎస్‌ఐ, పీఎఫతో పా టు ఉద్యో గభద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


రూ.10 వేల వేతనం చెల్లించాలి..మంజుల, ఆశవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు, కామారెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లో 2,010 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 1,231 మంది, కామా రెడ్డి జిల్లాలో 779 మంది విధు లు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్ర తీ పథకాన్ని విజయవంతం చే స్తున్న తమపై  ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. పారితోషికాలతో మా కడుపులు నిండడం లేదు. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకుం టున్నాం. కాబట్టి మాకు పారితోషికం కాకుండా కనీస వేతనం గా రూ. 10 వేల వేతనం అందించాలి.

Updated Date - 2020-10-07T10:48:01+05:30 IST