కుంటలో పడి రైతు మృతి
ABN , First Publish Date - 2020-12-12T05:04:23+05:30 IST
ప్రమా దవశాత్తు కుంటలో పడి ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సురాయిపల్లి జగదాంబతండాలో చోటు చేసుకుంది.
లింగంపేట, డిసెంబర్ 11: ప్రమా దవశాత్తు కుంటలో పడి ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సురాయిపల్లి జగదాంబతండాలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలి పిన వివరాల ప్రకారం.. పోతాయిపల్లి శివారులోని బోలోస్ కుంట సమీ పంలో విఠల్(47)కు మూడు ఎకరాల పొలం ఉంది. నారుమడికి నీరు పెట్ట డానికి గురువారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో వెళ్లి తిరగిరాలేదు. శుక్రవా రం ఉదయం కొడుకుతో కలిసి పొలం వద్ద వెతుకగా కుంట గట్టుపై చెప్పులు కనిపించాయి. దీంతో కుంటలో వెతుక గా శవం లభ్యమైంది. భార్య పాతులో త్ కోమ్ని పిర్యాధు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్సై తెలిపారు. బహి ర్భూమికి వెళ్లి చెరువులో కడుక్కోవడానికి వెళ్లగా ప్రమాదం జరిగి ఉంటుందని ఆమె పిర్యాధులో పేర్కొంది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.