జిల్లాలో మరో పది కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-08T09:52:41+05:30 IST
జిల్లాలో మంగళవారం కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంతో పాటు జిల్లాలోని ఇ తర ప్రాంతాల్లో ..

నిజామాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):జిల్లాలో మంగళవారం కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంతో పాటు జిల్లాలోని ఇ తర ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. నగరంలో ని చంద్రశేఖర్నగర్కాలనీలో రెండు, అర్సపల్లిలో మూ డు, సీతారాంనగర్లో ఒక కేసు నమోదైంది. అలాగే సిరికొండ మండలంలో ఒకటి, బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని రాకాసిపేట్లో ఒకటి, భీమ్గల్లో ఒకటి, వర్నిలో ఒక కేసు నమోదయింది. కొన్ని జిల్లాలో నిర్వహించిన పరీక్షలలో బయట పడగా, మరికొన్ని హైదరాబాద్లో వెల్లడయ్యాయి. వర్నికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి పాజిటివ్ రావడతో అధికారులు అతడి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నారు. జిల్లాలో మంగళవారం వ రకు 162 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 81 మంది చికిత్స పొంది డిశ్చార్జి కాగా, నలుగురు మృతిచెందారు. 77 మంది జిల్లా కేంద్ర జనరల్ ఆసుపత్రితో పాటు హైదరాబాద్లో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ ఆసు పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు..
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పె రుగుతున్నాయి. కేసులసంఖ్య పెరుగుతుండడంతో అధి కారులు ప్రైమరి, సెకండరి కాంటాక్ట్స్పైన దృష్టిపెడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలను చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో చర్యలను తీసుకోవడంతో పాటు వారు కలిసిన వారిని హోంక్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నారు. నిత్యం వైద్యసిబ్బంది వెళ్లి వారిని పరిశీలిస్తున్నారు. కేసులు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొన్నారు. జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలతో పా టు అధికారులు కూడా ఆందోళన చెదుతున్నారు. గ్రా మాల పరిధిలో కేసులు తక్కువగాఉన్నా నగరంతో పా టు ఇతర ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.