90 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-28T04:49:08+05:30 IST

మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి లారీలో అక్ర మంగా రవాణా చేస్తున్న 90 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ లక్ష్మీ తెలిపారు.

90 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత
నల్లబెల్లంతో పట్టుబడిన నిందితులతో ఎక్సైజ్‌ అధికారులు

మద్నూర్‌, నవంబరు 27: మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి లారీలో అక్ర మంగా రవాణా చేస్తున్న 90 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ లక్ష్మీ తెలిపారు. మండలంలోని సలాబత్‌పూర్‌ ఎక్సైజ్‌ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది తనిఖీ నిర్వహించారు. మహారాష్ట్రలోని బోకర్‌ నుంచి తెలంగాణలోని మహ బూబ్‌నగర్‌ జిల్లాకు అక్రమంగా 90 క్వింటాళ్ల బెల్లాన్ని తరలిస్తున్నారు. దీని విలువ సుమారు రూ.3లక్షల 50 వేలు ఉంటుందని సీఐ తెలిపారు. లారీని సీ జ్‌ చేసి ఇద్దరిని అరెస్టు చేశామని ఆమె వెల్లడించారు. నల్లబెల్లాన్ని గుడుంబా కు వాడుతారని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై జనార్ధన్‌, నాగరాజు, సిబ్బంది హన్మంత్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-11-28T04:49:08+05:30 IST