రెండు కరోనా పాజిటివ్ కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-07-07T11:27:58+05:30 IST
జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటి వ్ వచ్చినట్లు డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు
కామారెడ్డిటౌన్, జూలై 6: జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటి వ్ వచ్చినట్లు డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు. వీరు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నా రని తెలిపారు. కామారెడ్డికి చెందిన వ్యక్తి అల్వాల్ ప్రాంతంలో, బాన్సువాడకు చెందిన వ్యక్తి మెహిదీ పట్నంలో ఉంటున్నట్లు తెలిపారు. వారి ఆధార్ నెంబ ర్లో అడ్రస్ మాత్రం కామారెడ్డి జిల్లాకు చెందినవిగా ఉన్నాయని అన్నారు. సోమవారం 34 మంది రక్తనమూ నాలు పంపామని, మరో 131 మంది రక్తనమునాల ఫలి తాలు రావాల్సి ఉందని తెలిపారు.
బస్వాపూర్లో బ్యాంకు మేనేజర్కు...
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామ సిండికేట్ బ్యాంకు మేనేజ రుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు భిక్కనూరు మండల వైద్యాధికారి రవీందర్, ఎస్సై నవీన్కుమార్ సోమవారం తెలిపారు. బ్యాంకును సందర్శించి ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులను గుర్తించామన్నారు. శానిటైజింగ్ చేయించి బ్యాంకు మూసి వేసిన ట్లు తెలిపారు. ప్రైమరీ కాంటాక్టులో ఉన్న ఒకరిది హైదరాబాద్ కాగా, జం గంపల్లి, సిద్దరామేశ్వరనగర్ గ్రామాలకు చెందిన ఇద్దరు ఉన్నారని తెలిపారు.
వీరిని హోంక్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. బుధవారం పరీక్షల నిమిత్తం పంపనున్నట్లు చెప్పారు. మోటాట్పల్లి గ్రామంలో పాజిటివ్ కేసుకు ప్రైమరీ కాంటా క్టులో ఉన్న తొమ్మిది మందిని, రామాయంపేటకు చెందిన పాజిటివ్ ప్రైమరీ కాం టాక్టులో ఉన్న ఇద్దరిని పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట మండల వైద్యాధికారి శిరీష్, వైద్య, పోలీ సు సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.