డాక్టర్‌ త్రివేణికి మహర్షి బాదరాయణ వ్యాస్‌ సమ్మాన్‌ పురస్కారం

ABN , First Publish Date - 2020-12-09T05:04:58+05:30 IST

తెలంగాణ విశ్వ విద్యాలయంలోని తెలుగు అధ్యాయణ శాఖకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వంగరి త్రివేణికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి యువప్రోత్సాహక పురస్కారం మహర్షి బాదరా యణ వ్యాస్‌ సమ్మాన్‌ 2019కు ఎంపికైన విష యం విధితమే.

డాక్టర్‌ త్రివేణికి మహర్షి బాదరాయణ వ్యాస్‌ సమ్మాన్‌ పురస్కారం
త్రివేణికి చెక్కు అందజేస్తున్న రిజిస్ర్టార్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 8:  తెలంగాణ విశ్వ విద్యాలయంలోని తెలుగు అధ్యాయణ శాఖకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వంగరి త్రివేణికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి యువప్రోత్సాహక పురస్కారం మహర్షి బాదరా యణ వ్యాస్‌ సమ్మాన్‌ 2019కు ఎంపికైన విష యం విధితమే. కాగా ఈ సంవత్సరం మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లిలోని రాష్ట్రపతి భవ న్‌లో రాష్ట్ర పతి చేతుల మీదుగా ఈ పురస్కా రం పొందాల్సి ఉండగా కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ నిబంధనలను అనుసరించి తేదీల్లో మా ర్పు జరిగింది. ఇదిలా ఉండగా పురస్కార నగ దు రూ.లక్ష డాక్టర్‌ వంగర త్రివేణి బ్యాంక్‌ అ కౌంట్‌కు పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా 2021 ఆర్థిక సంవత్సరం నుంచి ఒకేసారి మానిటరీ గ్రాంట్‌ తర్జుమా చేసినట్లు రాష్ట్రీయ సంస్కృత సమ్మాన్‌ న్యూ ఢిల్లీ నుంచి ఎకానర్జ్‌ రిసిప్ట్‌ లేటర్‌ మంగళవారం ఉదయం అందిందని తెలిపారు. ఈ నగదు క్రెడిట్‌ లెట ర్‌ను రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం చేతుల మీదుగా త్రివేణి అందుకున్నారు. త్వరలో ఢిల్లీలో రా ష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల ద్వారా మహ ర్షి బాదరాయణ అవార్డును, గౌరవ పురస్కారం, ప్రశంసాపత్రం పొందనున్నారు. ఈ సందర్భం గా త్రివేణిని వీసీ నీతూ కుమారీ ప్రసాద్‌, రిజి స్ర్టార్‌ నసీంలు, పరిశోధక విద్యార్థులు, అధ్యా పకులు ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యం గా ఈ నగదును ఆధ్యాత్మిక, తాత్విక, చింతనా త్మక గ్రంథాల ప్రచురణకు వినియోగించనున్న ట్లు త్రివేణి తెలిపారు.

Updated Date - 2020-12-09T05:04:58+05:30 IST