రూ.11లక్షల విలువైన సొత్తు స్వాధీనం

ABN , First Publish Date - 2020-10-04T10:26:26+05:30 IST

వర్ని మండల కేంద్రంతోపాటు మోస్రా మండలం గోవూరు గ్రామం లో ఇటీవల జరిగి న దొంగతనాల కేసులను ఛేదించి నట్లు బోధన్‌ ఏసీ పీ రామారావు

రూ.11లక్షల విలువైన సొత్తు స్వాధీనం

వర్ని, అక్టోబరు 3: వర్ని మండల కేంద్రంతోపాటు మోస్రా మండలం గోవూరు గ్రామం లో ఇటీవల జరిగి న దొంగతనాల కేసులను ఛేదించి నట్లు బోధన్‌ ఏసీ పీ రామారావు వె ల్లడించారు. వర్ని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బాన్సువాడ పట్టణానికి చెందిన పాత నేరస్తుడు ఉత్కల్‌కర్‌ సాయికుమార్‌ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకుని ఈ దొంగతనాలు చేసినట్లు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రూ. 11లక్షల విలువ కలిగిన 12 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి, రూ.60 వేల నగదును స్వాధీనం చేసు కున్నట్లు వివరించారు. క్రైంబ్రాంచ్‌ పోలీసులు బాబూరావు, అనీల్‌, విఠల్‌ ఈ కేసులను చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించారని అభినందిస్తూ వారికి రివార్డులు అందించారు. వర్నిలోని కల్లు దుకాణాలను దొంగలు అడ్డాగా మా ర్చుకున్నట్లు గుర్తించామన్నారు. సమావేశంలో రుద్రూరు సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్‌ఐ అనిల్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-10-04T10:26:26+05:30 IST