ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఖైదీ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-31T05:16:34+05:30 IST
తాగిన మైకంలో క న్న కూతురిని అకారణంగా హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభ విస్తున్న గడ్డం చిన్న బాలరాజు (45) ఎర్రగడ్డలోని మానసిక ఆసు పత్రిలో బుధవారం ఉదయం బా త్రుమ్లోని కిటికికి టవల్తో ఉరే సుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అమీర్పేట, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి) తాగిన మైకంలో క న్న కూతురిని అకారణంగా హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభ విస్తున్న గడ్డం చిన్న బాలరాజు (45) ఎర్రగడ్డలోని మానసిక ఆసు పత్రిలో బుధవారం ఉదయం బా త్రుమ్లోని కిటికికి టవల్తో ఉరే సుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఇమ్రియాల్ గ్రామానికి చెందిన గడ్డం చిన్న బాలరాజు 2017న తాగిన మైకంలో కన్న కూతురిని హత్య చేసాడు. ఇతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జీసీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలిం చిన న్యాయస్థానం బాలరాజుకు జీవిత ఖైదు విధిస్తు 2020 జనవరిన తీర్పు వెలు వరించారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలరాజు పలుమార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దింతో ఇతని మానసిక పరిస్థితి బాగలేదని గమనించిన జైలు అధికారులు ఈ నెల 3న ఎర్రగడ్డలోని మానసిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. హత్యానంతరం భార్యపిల్లలు తనను విడిచివెళ్లడం, అమ్మనాన్న సో దరులు కూడా మరణించడంతో జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్యకు పాల్పడి ఉం టాడని పోలీసులు భావిస్తున్నారు. బాలరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం భార్యకు తెలియచేసిన అతనితో తమకు ఏలాంటి సంబంధం లేదని నిర్మోహమా టంగా తెలిపినట్లు ఎస్ఐ ఆంజనేయులు వెల్లడించారు. ఆసుపత్రి ఆర్ఎంవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని మార్చురిలో భద్ర పరిచామని పోస్టుమార్టం అనంతరం బంధువులు ఎవరురాకుంటే జీహెచ్ఎంసీ సిబ్బందితో ఖననం చేయిస్తామని ఎస్ఐ వెల్లడించారు.