మహారాష్ట్రలో 42కు కరోనా కేసులు.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో మాత్రం...

ABN , First Publish Date - 2020-03-18T16:38:35+05:30 IST

ఇప్పటి వరకూ ఎక్కువగా వెలుగు చూస్తున్న కరోనా అనుమానిత కేసులు ఉన్న రాష్ట్రాల్లో...

మహారాష్ట్రలో 42కు కరోనా కేసులు.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో మాత్రం...

మహారాష్ట్ర సరిహద్దులో కనిపించని కరోనా పరీక్షలు

నవీపేట: ఇప్పటి వరకూ ఎక్కువగా వెలుగు చూస్తున్న కరోనా అనుమానిత కేసులు ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. దీంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సరిహద్దుల్లోనే స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతించాలని సూచించింది. కానీ నిర్మల్‌ జిల్లా బాసర మండల పరిధిలో గల మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు కనిపించడం లేదు.


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సరిహద్దుల్లో తనిఖీలు గానీ, పరీక్షలు నిర్వహించే సిబ్బంది గానీ ఎవరూ లేరు. ఎప్పటిలాగే వాహనాలు రెండు రాష్ట్రాల మధ్య ప్రజలు ఎలాంటి తనిఖీలు లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోవడంపై కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-03-18T16:38:35+05:30 IST