ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-21T11:07:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో నిర్వ హిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువుకోవాలని కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు.

ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

రాజంపేట, నవంబరు 20: రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో నిర్వ హిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువుకోవాలని కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు. మండలంలోని కొండాపూర్‌, గుండారం గ్రామాల్లో శుక్రవారం విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల నేర్చుకుంటున్న పాఠాలు, వారి నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. ప్రతీ విద్యార్థి ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా సెక్టోరియల్‌ అధికారి గంగాకిషన్‌, ప్రధానోపాధ్యాయులు నళినీదేవి, రాణి, భైరవనాథ్‌, అశోక్‌ రావు, శైలజ, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T11:07:02+05:30 IST