గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
ABN , First Publish Date - 2020-11-19T10:11:48+05:30 IST
జిల్లాలోని గ్రంథాల యాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్సీ కవితను కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్ గౌడ్ విన్నవించారు.
![గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/202011190410460/11192020044125n52.jpg)
కామారెడ్డిటౌన్, నవంబరు 18: జిల్లాలోని గ్రంథాల యాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్సీ కవితను కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్ గౌడ్ విన్నవించారు. హైదరాబాద్లో బుధవారం ఆ యన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్తో కలిసి ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపా రు. జిల్లాలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు అవసర మైన పుస్తకాలతోపాటు ఆయా మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను అభివృద్ధికి సహకారం అందించాల ని ఎమ్మెల్సీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనో హర్రావు తదితరులు పాల్గొన్నారు.