నిర్మానుష్యంగా లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం
ABN , First Publish Date - 2020-03-23T10:53:42+05:30 IST
నిర్మానుష్యంగా లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం

మాచారెడ్డి, మార్చి 22 : మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం జనతా కర్ఫ్యూలో భాగంగా నిర్మానుష్యంగా మారింది. ప్రతీ ఆదివారం వేల మంది భక్తులతో కిటకిటలాడే ఆలయం కరోనా వైరస్తో భక్తులు లేక వెలవెల బోయింది. అటు పూజారులు సైతం జనతా కర్ఫ్యూలో పాల్గొని మద్దతు తెలిపారు.