విదేశాల నుంచి వచ్చిన వారు స్వయంగా క్వారంటైన్కు వెళ్లాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-03-21T08:43:34+05:30 IST
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వయంగా క్వారం టైన్లో (ఇండ్లలోనే వేరుగా) ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి...
నిజామాబాద్ అర్బన్: విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వయంగా క్వారం టైన్లో (ఇండ్లలోనే వేరుగా) ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ పరీక్షలు చేయించుకోవాలని, రెండు వారాల పాటు తమ ఇండ్లలోనే ఉండాలని సూచించారు. జిల్లా య ంత్రాంగం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అందరి వివరాలను సేకరించి వారిని వేరుగా ఉంచే విధంగా పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి జాగ్రత్తలు పాటించి కరోనా నివారణకు కలిసి పోరాడాలని అన్నారు.