వ్యక్తి ఆత్మహత్య...శవంతో గ్రామస్థుల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-07T17:26:58+05:30 IST

జిల్లాలోని సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో శవంతో గ్రామస్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

వ్యక్తి ఆత్మహత్య...శవంతో గ్రామస్థుల ఆందోళన

నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో శవంతో గ్రామస్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తర్ర గంగాధర్ అనే వ్యక్తి నిన్న  చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన పుర్రె మమత హత్య కేసులో గంగాధర్ ప్రధాన నిందితుడు. అయితే పోలీసులు విచారణకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారనే మనస్థాపంతో గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు. విచారణ పూర్తి అయ్యే వరకు శవాన్ని ఇక్కడి నుండి తరలించేది లేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు. 

Updated Date - 2020-12-07T17:26:58+05:30 IST