’రైతు సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం’
ABN , First Publish Date - 2020-12-31T05:10:28+05:30 IST
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు తెలిపా రు.
![’రైతు సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కామారెడ్డిటౌన్, డిసెంబరు 30: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు తెలిపా రు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చే సిన సమావేశంలో వారు మాట్లాడారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా కామారెడ్డిలో జనవరి ఒకటో తేదీ నుంచి నిరవధిక దీక్షలు చేపడుతున్నామన్నారు. చంద్రశేఖర్, నర్సింహరెడ్డి, జగన్నాథం పాల్గొన్నారు.