‘మారుతీ మందిరం భూములను వెనక్కి తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-12-28T04:22:12+05:30 IST

: బోధన్‌లో కబ్జాకు గురైన మారుతీ మం దిరం భూములను వెనక్కి తీసుకోవాలని, ఆలయ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

‘మారుతీ మందిరం భూములను వెనక్కి తీసుకోవాలి’
ధర్నా చేస్తున్న శివసేన నాయకులు

బోధన్‌, డిసెంబరు 27 : బోధన్‌లో కబ్జాకు గురైన మారుతీ మం దిరం భూములను వెనక్కి తీసుకోవాలని, ఆలయ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఒక ఎకరం 22 గుంటల భూ మి సర్వే నెంబరు 245, 245ఏలో ఉన్నాయని, ఈ భూములను కా పాడాలని డిమాండ్‌ చేశారు. దేవాదాయశాఖ అధికారులు ఈ భూ ములను స్వాధీన పర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు నిర్ల క్ష్యంగా వ్యవహరించకుండా భూముల రక్షణకు చర్యలు తీసుకో వాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మధుకు వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో శివసేన జిల్లా అధ్యక్షుడు పలుసోటి గోపి కిషన్‌, కిశోర్‌, ప్రీతం, ఈశ్వర్‌, గంగాధర్‌, అబ్బయ్య, భూమేష్‌, అనిల్‌, లోకేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:22:12+05:30 IST