3న మహా బోగ్‌ బండార్‌

ABN , First Publish Date - 2020-12-30T04:49:53+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెంలో జనవరి 3న ఆలిండియా బంజారా సేవా సంఘం సెంట్రల్‌ అసోసియేషన్‌ తరఫున మహా బోగ్‌ బండార్‌ నిర్వహిస్తున్నామని ఆలిండియా బం జారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్‌ తెలి పారు.

3న మహా బోగ్‌ బండార్‌

నిజామాబాద్‌  అర్బన్‌, డిసెంబరు 29: భద్రాద్రి కొత్తగూడెంలో జనవరి 3న ఆలిండియా బంజారా సేవా సంఘం సెంట్రల్‌ అసోసియేషన్‌ తరఫున మహా బోగ్‌ బండార్‌ నిర్వహిస్తున్నామని ఆలిండియా బం జారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్‌ తెలి పారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాబోగ్‌ బండార్‌తో పాటు రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరై గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడ చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యోగుల సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మున్నినాయక్‌కు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్య క్షుడు బూక్యా చంద్రూనాయక్‌, గౌరవ అఽధ్యక్షుడు డాక్టర్‌ హరికృష్ణ, రామారావు చౌహాన్‌, రాంచందర్‌ నాయక్‌, గోపాల్‌ నాయక్‌, తారాచంద్‌, లక్ష్మణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T04:49:53+05:30 IST