జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-12-05T05:47:57+05:30 IST

డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధి ఏడో నెంబరు జాతీయ రహదారి క్రిష్టియన్‌ మెడికల్‌ కళాశాల రహదారి పక్కనే కూలీ పనులు చేసేందుకు వస్తున్న టోల్‌ప్లాజా కూలీల ఆటోను ఎదురుగా అజాగ్రత్తగా వస్తున్న లారీ ఢీకొనడంతో అందులోని ఏడుగురు కూలీలకు గాయాలైనట్లు టోల్‌ప్లాజా సిబ్బంది శుక్రవారం విలేకరులకు తెలిపారు.

జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న లారీ
లారీ ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన ఆటో ముందుభాగం

ఏడుగురికి గాయాలు
డిచ్‌పల్లి, డిసెంబరు 4: డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధి ఏడో నెంబరు జాతీయ రహదారి క్రిష్టియన్‌ మెడికల్‌ కళాశాల రహదారి పక్కనే కూలీ పనులు చేసేందుకు వస్తున్న టోల్‌ప్లాజా కూలీల ఆటోను ఎదురుగా అజాగ్రత్తగా వస్తున్న లారీ ఢీకొనడంతో అందులోని ఏడుగురు కూలీలకు గాయాలైనట్లు టోల్‌ప్లాజా సిబ్బంది శుక్రవారం విలేకరులకు తెలిపారు. గాయపడినవారిలో రాజ్‌కుమార్‌, రమేష్‌తోపాటు మరో ఐదుగురు ఉన్నారన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం ధ్వంసం కాగా, లారీ రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయి పక్కగా నిలిచిపోయింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుద్దపల్లి జాతీయ రహదారిపై రోడ్డు మధ్యలోనున్న మొక్కలు, పొదలు బాగుచేసేందుకు వచ్చిన కూలీల ఆటోను లారీ ఢీకొట్టిందన్నారు.



Updated Date - 2020-12-05T05:47:57+05:30 IST