ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం
ABN , First Publish Date - 2020-10-30T10:34:44+05:30 IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపికైన కల్వకుంట్ల కవిత గురువా రం ప్రమాణస్వీకారం చేశారు.
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఫఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లిన స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు
నిజామాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపికైన కల్వకుంట్ల కవిత గురువా రం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమెను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి అభినందించారు. ప్ర మాణస్వీకార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రు లు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, మండలి డి ప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
అలాగే, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్రెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సు రేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, భాస్కర్రావు, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, వీజీగౌడ్, ఆకుల లలిత, షేరి సుభాష్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావు, ఫారూఖ్ హుస్సేన్, రెడ్కో చైర్మన్ అలీం, టీఆర్ఎ స్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారితో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హై దరాబాద్కు తరలివెళ్లి ఆమెను కలిసి అభినందనలు తెలిపారు.