జేసీబీ, నాలుగు ట్రాక్టర్ల సీజ్
ABN , First Publish Date - 2020-12-25T05:32:34+05:30 IST
మండలంలోని అభంగ పట్నం శివారులో అక్రమంగా మొరం తవ్వుతున్న ఒక జేసీబీతోపాటు నాలుగు ట్రాక్టర్లను తహసీల్దార్ లత గురువారం సీజ్ చేశారు.
![జేసీబీ, నాలుగు ట్రాక్టర్ల సీజ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నవీపేట, డిసెంబరు 24: మండలంలోని అభంగ పట్నం శివారులో అక్రమంగా మొరం తవ్వుతున్న ఒక జేసీబీతోపాటు నాలుగు ట్రాక్టర్లను తహసీల్దార్ లత గురువారం సీజ్ చేశారు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం రావడంతో తహసీల్దార్ ఆ ప్రదేశానికి వెళ్లి వాహనాలను స్వాధీ నం చేసుకున్నారు. వాటిని నవీపేట పోలీస్స్టేషన్కు తరలించారు.