పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-03-08T11:48:45+05:30 IST
జిల్లా కేంద్రంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియ ట్ పరీక్షలను జిల్లా అదనపు కలెక్టర్

కామారెడ్డిటౌన్, మార్చి 6: జిల్లా కేంద్రంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్దోత్రే పరిశీలించారు. పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాల ని, మాల్ ప్రాక్టిస్ జరగకుండా చూడాలని సూచిం చారు. జిల్లాలో జనరల్ సబ్జెట్లకు 7852 మంది హా జరుకావల్సి ఉండగా 7696 మంది విద్యార్థులు హాజరయ్యారు. 156 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వృత్తి విద్య విద్యార్థులు 838 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 805 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ నోడల్ అధికారి నాగరాజు తెలిపారు.