తీరు మార్చుకోకుంటే సస్పెన్షన్ చేయిస్తా..
ABN , First Publish Date - 2020-12-04T05:16:33+05:30 IST
మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ను గురువారం ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తనిఖీ చేశారు.
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
బీర్కూర్, డిసెంబరు 3: మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ను గురువారం ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తనిఖీ చేశారు. పనితీరు మార్చుకోకుంటే సస్పెన్షన్ చేయిస్తానని బ్యాంకు మేనేజర్ శివ శంకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాల్లో జమ ఉన్న డబ్బులను ఇవ్వమంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బ్యాంకు మేనేజర్ శివశంకర్పై రైతులు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ డబ్బుల కోసం వేచి చూడాల్సి వస్తోందని రైతులు చైర్మన్కు విన్నవిం చారు. దీంతో బ్యాంకును ఆయన సందర్శించారు. రైతులు లేకపోతే ఎన్డీసీసీబీ బ్యాంకులు ఎలా నడుస్తాయని, రైతులు ఎలా డిపాజిట్లు చేస్తారని మేనేజర్ను ఆయన నిలదీశారు. పనితీరు మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ రఘు, బీర్కూర్ విండో చైర్మన్ గాంధీ, కో-ఆప్షన్ ఆరీఫ్, నాయకులు రాజు, వీరేశం, గంగారాం, తదితరులున్నారు.