హైదరాబాద్ నుంచి సొంతూరికి వెళ్లిన ఓ కుటుంబం.. సడన్ గా జ్వరం.. చివరకు..
ABN , First Publish Date - 2020-07-06T20:25:38+05:30 IST
టగిరి మండలంలోని సుంకిని గ్రామంలో ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి రావడంతో వారిని ఇంట్లోనే ఉండాలని ఎస్సై మశ్య్చేందర్రెడ్డి సూచించారు.
సుంకినిలో హోంక్వారంటైన్లో కుటుంబం
కోటగిరి (నిజామాబాద్): కోటగిరి మండలంలోని సుంకిని గ్రామంలో ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి రావడంతో వారిని ఇంట్లోనే ఉండాలని ఎస్సై మశ్య్చేందర్రెడ్డి సూచించారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఉండి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ యజమానికి తీవ్రమైన జ్వరం రావడంతో వారంతా ఇంట్లోనే ఉండాలని ఎస్సై సూచించారు. కరోనా మహమ్మారిని అరి కట్టడంలో భాగంగా ముగ్గురు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఎస్సై వెంట తహసీల్దార్ విఠల్, గ్రామ సర్పంచ్ మాధవరావు, నాయకులు కిషన్రావు తదితరులున్నారు.