‘రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలి’
ABN , First Publish Date - 2020-12-02T04:39:41+05:30 IST
కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు డిమాండ్ చేశారు.

పెద్దబజార్, డిసెంబరు 1: కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్ర భుత్వం తీసుకున్న వ్యవసాయ చట్టాన్ని రద్దుచేయాలన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన లక్షలాది మంది రైతులను ఢిల్లీ పొలిమేరల్లోనే ఆపి లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. రైతులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు గంగాధరప్ప, సబ్బని లత, రాములు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.