అర్హులకు డబుల్ బెడ్ రూంలు..
ABN , First Publish Date - 2020-12-17T05:33:39+05:30 IST
డబుల్ బెడ్ రూం నిర్మాణాలు చేపడుతామని, అర్హులైన లబ్ధిదారు లకు మొదటి విడతలో 15 మందిని అధికారులు ఎంపిక చేస్తారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.

ఎల్లారెడ్డి, డిసెంబరు 16: డబుల్ బెడ్ రూం నిర్మాణాలు చేపడుతామని, అర్హులైన లబ్ధిదారు లకు మొదటి విడతలో 15 మందిని అధికారులు ఎంపిక చేస్తారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణ కేంద్రంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పెద్దచెరువు కట్టకు రూ.10కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాప్రెడ్డి, జలంధర్రెడ్డి, జడ్పీటీసీ ఉషాగౌడ్, సత్యం రావు, శంకర్నాయక్, ఏఎంసీ చైర్మన్రాధ, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.