అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
ABN , First Publish Date - 2020-07-18T10:47:40+05:30 IST
అభివృద్ధి పనుల పట్ల అధికారులు ప్రజా ప్రతి నిధులు నిర్లక్ష్యం వహించవద్దని అదనపు కలెక్టర్ లత సూచించారు

బోధన్, జూలై 17 : అభివృద్ధి పనుల పట్ల అధికారులు ప్రజా ప్రతి నిధులు నిర్లక్ష్యం వహించవద్దని అదనపు కలెక్టర్ లత సూచించారు. శుక్రవారం బోధన్కు వచ్చిన ఆమె మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు ల్లో పర్యటించారు. పట్టణంలో నిర్మాణం చేపడుతున్న పబ్లిక్ టాయిలె ట్స్, మియవాకీ ప్లాంటేషన్ పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటిని పోసి ట్రీగార్డుల ఏర్పాటును పర్యవేక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. నిర్దిష్ట గడువు మేరకు పనులను పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. యాదాద్రి ప్లాంటేషన్లో భాగంగా చేపడుతున్న మియవాకీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ రామలింగం, కౌన్సిలర్లు శరత్రెడ్డి, దూప్సింగ్, డీఈ శివానందం, రామకృష్ణ, బాల్రెడ్డి, రఫీ, నాయకులు ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.