ప్రశాంతంగా జ్యోతిబాపూలే ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-03-16T10:25:05+05:30 IST

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతులలో ప్రవేశానికి

ప్రశాంతంగా జ్యోతిబాపూలే ప్రవేశ పరీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 15: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతులలో ప్రవేశానికి ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని 23 పరీక్ష కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించగా 6వ తరగతి పరీక్షకు 2,867 మంది పరీ క్షలు రాయాల్సి ఉండగా 2467 మంది పరీక్షలు రాయగా 400 మంది గైర్హాజరయ్యారు. 7వ తరగతిలో ప్రవేశానికి 1408 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 1233 మంది పరీక్ష రాయగా 175 మంది గైర్హార య్యారు. 8వతరగతిలో ప్రవేశానికి 1,079 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 934మంది పరీక్ష రాశారు. 145 మంది గైర్హాజర య్యారు. మొత్తం 5354 మందికి 4634 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 720 మంది పరీక్షలకు హాజరుకాలేదు. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్‌రావు, మహాత్మాజ్యోతిబాపూలే ప్రాం తీయ సమన్వయకర్త జి.తిరుపతి పరిశీలించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వారు తెలిపారు. 

Updated Date - 2020-03-16T10:25:05+05:30 IST