చిరుత కోసం బోను ఏర్పాటు
ABN , First Publish Date - 2020-12-14T05:19:00+05:30 IST
లింగంపేట మండలంలోని నాగారం అటవీశివారులో ఆదివారం చిరుత కోసం బోనును ఏర్పాటు చేసినట్లు సెక్షన్ అధికారి సలీం తెలిపారు.

లింగంపేట, డిసెంబరు 13: లింగంపేట మండలంలోని నాగారం అటవీశివారులో ఆదివారం చిరుత కోసం బోనును ఏర్పాటు చేసినట్లు సెక్షన్ అధికారి సలీం తెలిపారు. ఇటీవల నాగారం శివారులో చిరుత సంచరిస్తుందని ఆయా గ్రామాల ప్రజలు, రైతు లు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాలు ఉన్న ప్రాంతంలో బోన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాత్రి వేళల్లో రైతులు బోరుబావుల వద్దకు వెళవద్దని ఆయన సూచించారు.