అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-09-19T09:58:41+05:30 IST
నా లుగు రోజులుగా కు రుస్తు న్న భారీ వర్షాల కారణ ంగా కామారెడ్డి జి ల్లా బాన్సువాడ డివిజన్లోని అధికారులు అప్రమత్తంగా
కామారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశం
బిచ్కుంద, సెప్టెంబరు 18: నా లుగు రోజులుగా కు రుస్తు న్న భారీ వర్షాల కారణ ంగా కామారెడ్డి జి ల్లా బాన్సువాడ డివిజన్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. బిచ్కుంద మండలంలోని ఖద్గాం, శెట్లూర్, హస్గుల్, బిచ్కుంద గ్రామాల్లో నీట మునిగిన పం టలను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండేతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అలాగే మండలంలోని హస్గు ల్ గ్రామంలో నిర్మాణమవుతున్న రైతువేదిక భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీ వో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షం కారణంగా నీట మునిగి దెబ్బతిన్న ప్రతి ఎకరాకు పరిహారం అందేలా చూస్తానన్నారు. డివిజన్లోని వ్యవ సాయ అధికారులు పంట నష్టం వివరాలు, రెవెన్యూ అధికారులు దెబ్బతిన్న ఇళ్ల్ల వివరాలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధి కారులు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జి ల నివేదికలను వారంలోగా సమర్పించాలని ఆదేశించారు.
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే మాట్లాడుతూ, నీట మునిగి పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహా రం అందించే విధంగా అధికారులు దృ ష్టిసారించాలన్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతీ ఒక్కరికి పూర్తిగా న్యా యం జరిగేలా అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే కోరారు. బాన్సువాడ ఆ ర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ అశోక్పటేల్, సొ సైటీ చైర్మన్ బాలు, ఏఎంసీ మాజీ చైర్మన్ నాల్బర్రాజు, నియోజకవర్గస్థాయి వ్యవ సాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.