యువకుడిపై సీసాతో దాడి
ABN , First Publish Date - 2020-03-04T11:29:25+05:30 IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తు లు సీసాతో తలపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది...
![యువకుడిపై సీసాతో దాడి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కామారెడ్డి, మార్చి3: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తు లు సీసాతో తలపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకు చెందిన అరె రాము(31) యువకుడిని గాంధీ గంజ్లో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తలపై సీసాతో దాడిచేయడంతో రక్తం మడు గులో పడి ఉండటంతో స్థానికులు వెంటనే అతనిని చి కిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పట్టణ పోలీసులకు వివ రణ కోరగా.. తమకు ఫిర్యాదు అందలేదని ఎస్హెచ్వో జగదీష్ తెలిపారు. యువకుడిపై పథకం ప్రకారమే సీ సాతో తలపై దాడిచేసి గాయపరిచారా లేక దాడికి ఇత ర కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.