ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన

ABN , First Publish Date - 2020-12-30T05:31:24+05:30 IST

రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కామారెడ్డి పట్టణశివారులోని టె క్రియల్‌ జాతీయ రహదారిపై బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 29: రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కామారెడ్డి పట్టణశివారులోని టె క్రియల్‌ జాతీయ రహదారిపై బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల అనంత కృష్ణ మాట్లాడా రు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ యువత నిరాశకు గురైందని తెలిపారు. పోలీసులు నాయకులను అరెస్ట్‌ చే సి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి నీలం చిన్నరాజు, నరేందర్‌, విఠల్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:31:24+05:30 IST