జిల్లాలో కొత్తగా మరో 25 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-16T10:23:48+05:30 IST
జిల్లాలో శనివారం కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు

నిజామాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో శనివారం కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69కి చే రిందన్నారు. ఇందులో 1,405 కేసులు యాక్టివ్ గా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు చికిత్స పొం ది 657 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపారు. అలాగే జిల్లాలో శనివారం కరోనాతో ముగ్గురు చనిపోయారని, ఇప్పటి వరకు మొత్తం 63 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.