17 నుంచి బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-12T04:51:01+05:30 IST
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అను బంధ కళాశాలల్లో గల బీఈడీ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యూలర్, ప్రా క్టికల్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయని పరీక్షల నియంత్ర ణాధికారి డాక్టర్ పాత నాగరాజు తెలిపారు.
డిచ్పల్లి, డిసెంబరు 11: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అను బంధ కళాశాలల్లో గల బీఈడీ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యూలర్, ప్రా క్టికల్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయని పరీక్షల నియంత్ర ణాధికారి డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. ఈ నెల 17న జరిగే మొదటి ఫేజ్లో ఆర్మూర్ రఘవేంద్ర బీఈడ్ కళాశాలలో రెండో సెమిస్టర్ రెగ్యూలర్, ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని సీవోఈ తెలిపారు. ఈ నెల 18న జరిగే రెండో ఫేజ్లో కామారెడ్డిలోని కర్షక్, ఆ ర్మూర్లోని ప్రియదర్శిని, బోధన్లో శ్రీ చైతన్య, సెయింట్ థామాస్, ఆజా న్, బిచ్కుందలోని సద్గురు, బాన్సువా డలో ని ప్రగతి బీఈడ్ కళాశాలలో రెండో సెమిస్టర్ రెగ్యూలర్, ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయన్నారు. 14న జరిగే 3వ ఫేజ్లో బోధన్లోని ఇందూరు, నిజా మాబాద్లోని కాటిపల్లి రవీందర్ రెడ్డి, శ్రీసాయి, సారంగపూర్లోని యూ నివర్సిటీ కళాశాల, బాన్సువాడలోని వెంకటేశ్వర, భిక్కనూర్లోని హైమాద్, మల్లరంలోని ఆయేషా బీఈడీ కళాశాలల్లో రెండో సెమిస్టర్ రెగ్యూలర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని బీఈడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.