ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం
ABN , First Publish Date - 2020-04-04T09:53:50+05:30 IST
ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివా్సరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల
డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి
దామరచర్ల / వేములపల్లి / కేతేపల్లి/ మాడ్గులపల్లి, ఏప్రిల్3 : ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివా్సరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్మార్కెట్ యార్డులో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు ప్రారంభించారు. వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం, మొల్కపట్నం, రావులపెంట, ఆమనగల్లు, తిమ్మారెడ్డిగూడెం, బుగ్గబావిగూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ పుట్టల సునీత జడ్పీటీసీ ఇరుగు మంగమ్మతో కలిసి ప్రారంభించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ, జడ్పీటీసీ పి.శేఖర్, బి.స్వర్ణలత ప్రారంభించారు. సల్కునూరు సహకార సంఘం ఆధ్వర్యంలో మాడ్గులపల్లి మండలంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పబ్బు సురేందర్రెడ్డి ప్రారంభించారు.