రూ.కోటితో టౌన్హాల్ నిర్మాణం
ABN , First Publish Date - 2020-12-18T05:20:01+05:30 IST
చౌటుప్పల్ మునిసిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బన్ మిషన్ పథకం కింద టౌన్హాల్ నిర్మాణానికి రూ.కోటి మంజూరయినట్లు డీఆర్డీవో మందడి ఉపేందర్ రెడ్డి తెలిపారు.
చౌటుప్పల్ టౌన్, డిసెంబరు 17: చౌటుప్పల్ మునిసిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బన్ మిషన్ పథకం కింద టౌన్హాల్ నిర్మాణానికి రూ.కోటి మంజూరయినట్లు డీఆర్డీవో మందడి ఉపేందర్ రెడ్డి తెలిపారు. మునిసిపాలిటీ కార్యాలయంలో గురువారం చైర్మన్ వెన్రెడ్డి రాజు అధ్యక్షతన రూర్బన్ నిధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ టౌన్హాల్తోపాటు డంపింగ్ యా ర్డు, గొర్రెలు, మేకల మార్కెట్ల నిర్మాణానికి రూర్బన్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయన్నారు. సమీక్షలో రామదుర్గారెడ్డి పాల్గొన్నారు.